Monday, October 21, 2024

TG | మ‌ణుగూరు – రామ‌గుండం.. కొత్త రైల్వే లైన్‌కు భూసేక‌ర‌ణ !

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, పెద్ద‌ప‌ల్లి : మ‌ణుగూరు నుంచి రామగుండం రైల్వే లైన్ భూసేక‌ర‌ణ‌కు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఈ నోటిఫికేష‌న్‌ను ఈ నెల 16వ తేదీన విడుద‌ల చేసింది. ఈ రైల్వే లైన్ 207.80 కిలోమీట‌ర్ల దూరం ప్ర‌తిపాదించారు. జ‌యశంక‌ర్ భూపాల్లి ప‌ల్లి జిల్లా, పెద్ద‌ప‌ల్లి జిల్లాలో భూసేక‌ర‌ణ‌కు రైల్వే అధికారులు నోటిఫికేష‌న్ ఇచ్చారు.

భూసేక‌ర‌ణ‌కు కేటాయించిన అధికారులు వీరే

మ‌ణుగూరు నుంచి రామ‌గుండం రైల్వే కొత్త లైన్ కోసం భూసేక‌ర‌ణ‌కు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఈ మేర‌కు అధికారుల‌ను కేటాయించారు. జ‌య‌శంక‌ర్ భూపాల్లిప‌ల్లి జిల్లా కాట‌రాం స‌బ్ క‌లెక్ట‌ర్ ప‌రిధిలో మ‌ల్హ‌రావు, కాపురం, భూపాల్లిప‌ల్లి ఆర్‌డీఓ ప‌రిధిలో ఘ‌న్‌పూర్‌, భూపాల్లిప‌ల్లి మండ‌లాల్లో పెద్ద‌ప‌ల్లి జిల్లా పెద్ద‌ప‌ల్లి ఎడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ ప‌రిధిలో ముత‌రాం, మంథిన‌, రామ‌గిరి మండ‌లాల్లో భూసేక‌ర‌ణ‌కు నోటిఫీకేష‌న్ విడుద‌ల చేశారు. త్వ‌ర‌లో భూస‌ర్వే ను ఆయా అధికారులు చేప‌ట్ట‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement