Friday, September 20, 2024

TG | కుమారీ అంటీ, టెక్నో పెయింట్స్ భారీ వ‌ర‌ద సాయం

హైదరాబాద్‌లో రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్ నడుపుతున్న‌ కుమారి ఆంటీ… సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యింది. తాజాగా ఆమె తన మంచి మనసును చాటుకుంది. తెలంగాణలో వర్షాలు, వరదల కారణంగా చాలా నష్టం జరిగింది. ఈ క్రమంలో వరద బాధితులకు సామాన్యులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు తమవంతు సహాయాన్ని అందిస్తున్నారు.

ఈ క్రమంలో కుమారి ఆంటీ కూడా ఆమెకు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని క‌లిసి ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి రూ.50 వేలను విరాళంగా అందించింది. ఈ సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆమెను అభినందించారు.

ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.20లక్షలు విరాళం అందజేశారు టెక్నో పెయింట్స్ అధినేత‌లు. జూబ్లీహిల్స్ నివాసంలో రేవంత్ రెడ్డిని టెక్నో పెయింట్స్ డైరెక్టర్స్ ఆకునూరి శ్రీనివాస్ రెడ్డి, సీవీఎల్ఎన్ మూర్తి, అనిల్ కొండోత్ క‌ల‌సి చెక్ అంద‌జేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement