Monday, September 16, 2024

TG | పేరుకే ప్ర‌జాప్ర‌భుత్వం… హైడ్రా కూల్చివేతలపై కేటీఆర్‌ ఫైర్

హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝళిపిస్తోంది. ఈ క్ర‌మంలో (ఆదివారం) కొందరు పేద, మధ్య తరగతి కుటుంబాలు ఉంటున్న ఇళ్లను కూల్చేసింది. ఈ ఘటనపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వం పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారన్నారు. జోరువానలో కనికరంలేని ప్రభుత్వం.. కర్కశంగా కూల్చివేస్తే అభాగ్యులు ప్లాస్టిక్ కవర్ల నీడలో త‌ల‌త‌దాచుకుంటున్నారని తెలిపారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హైదరాబాద్‌లో పేదల కోసం 4వేల డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను నిర్మించిందని… అవన్నీ పేదలకు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. వెంటనే ఈ ఇళ్లలోకి వారిన‌ తరలించాలని రాష్ట్ర సీఎస్‌కు విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement