Friday, September 20, 2024

TG | సుంకిశాల ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ… కేటీఆర్ డిమాండ్

సుంకిశాల ప్రాజెక్ట్ రిటైనింగ్ వాల్ ప్రమాదంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ పలు ప్రశ్నలు సంధించారు. కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిన తర్వాత కూడా టెర్మినల్ ప్రమాదాన్ని చిన్నదిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

సుంకిశాల పనుల్లో అవకతవకలు చేసిన కాంట్రాక్ట్ ఏజెన్సీని బ్లాక్ లిస్టులో పెట్టకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని ఎవరు, ఎందుకు ఆపుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మొత్తం వ్యవహారంపై నిష్పక్షపాతంగా విచారణ జరిగేలా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేందుకు ప్రభుత్వ పెద్దలు ఎందుకు వెనుకంజ వేస్తున్నార‌ని ప్రశ్నించారు. ఈ మొత్తం ప్రమాదాన్ని చిన్నదిగా కప్పిపుచ్చేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారని, దీనికి బాధ్యులెవరు అని రాహుల్ గాంధీని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement