Friday, September 6, 2024

Kaleswaram Visit – గోదావరిని ఎడారిగా మార్చారు – కాంగ్రెస్ పై కేటీఆర్ ధ్వజం

ఆంధ్రప్రభ స్మార్ట్ – చెన్నూరు – కాంగ్రెస్ ప్రభుత్వం గోదావరిని ఎడారిగా మార్చిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని ఇందారం వద్ద నీటి ప్రవాహం లేని గోదావరి నదిని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందంతో కలిసి పరిశీలించారు.

అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ అసమర్ధత రైతుల పాలిట శాపంగా మారిందన్నారు. గత ప్రభుత్వాన్ని కేసీఆర్ను బదనాం చేయాలని మేడిగడ్డ వద్ద నీటిని ఎత్తిపోయడం లేదన్నారు. గత ఆరు నెలలుగా కెసిఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు మంత్రులు చేసిన ఆరోపణలన్నీ తొలగిపోయాయన్నారు.

మేడిగడ్డ వద్ద గోదావరి ప్రవహిస్తున్నా ప్రాజెక్టుకు ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో కాంగ్రెస్ వి అసత్యపు ఆరోపణలని తేలిపోయిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నీటిని ఎత్తిపోసి రైతాంగానికి సాగునీరు ప్రజలకు తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement