Friday, September 20, 2024

Kerala – వయనాడ్ లో విరిగిపడ్డ కొండచరియలు – 24 మంది సజీవ సమాధి…శిధిలాల కింద 400 మంది

కేరళలోని వయనాడ్ జిల్లా మెప్పాడి, చూరాల్‌మల సమీపంలో మంగళవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 24 మంది మృతి చెందారు.

ఈ పెను ప్రమాదంలో ఇప్పటి వరకు 24 మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు.శిథిలాల కింద 400 మందికి పైగా చిక్కకుని ఉంటారని సమచారం అందుతోంది. భారీ వర్షం మధ్యే సహయక చర్యలు కొనసాగుతున్నాయి. గత కొద్దిరోజుల కురిస్తున్న వర్షలకు కొండచరియలు విరిగిపోడుతున్నాయి. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

- Advertisement -

రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి

వాయనాడ్‌లోని మెప్పాడి సమీపంలో భారీ కొండచరియలు విరిగిపడటంతో తాము తీవ్ర వేదనకు గురయ్యానని ఆందోళన వ్యక్తం చేశారు. తమ వాళ్ళను కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని… ఇంకా చిక్కుకున్న వారిని త్వరలోనే సురక్షిత ప్రాంతాలకు తీసుకువస్తారని ఆశిస్తున్నానని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement