Friday, October 4, 2024

Liquor scam | విచార‌ణ‌కు హాజ‌రైన క‌విత !

ఢిల్లీ మద్యం కుంభ‌కోనం కేసులో సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌పై నేడు శుక్రవారం ఢిల్లీలోని రోస్ ఆఫ్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఆమ్ ఆద్మీ పార్టీ నేత దుర్గేష్ పాఠక్, విజయ్ నాయర్ కోర్టులో వర్చువ‌ల్ గా విచారణకు హాజరయ్యారు. అయితే ఈ కేసు విచారణను కోర్టు వాయిదా వేసింది.

కాగా, తదుపరి విచారణ అక్టోబర్ 19 వరకు కోర్టు వాయిదా పడింది. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియా, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వంటి తదితర నేతలకు ఇటీవలే సుప్రీంకోర్టు బెయిల్ ని మంజూరు చేసిన విషయం అందరికీ తెలిసిందే. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నేతృత్వంలో కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా కోర్టు విచారణలు కొనసాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement