Sunday, September 15, 2024

మూడు నెలల పాటు భారీ ఊరేగింపులు నిషేధం..

కర్ణాటకలో కొత్త కేసుల ఉధృతి రోజు రోజుకు పెరుగుతోంది. థర్డ్‌వేవ్ ప్రమాదంపై నిపుణులు హెచ్చరికల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ, మతపరమైన సమావేశాల్లో భారీగా గుమిగూడటం, ఊరేగింపులను కర్ణాటక ప్రభుత్వం బ్యాన్‌ విధించింది. ఆగస్టు- అక్టోబర్ వరకు పండుగ సీజన్‌ ప్రారంభంకాన్ను నేపథ‍్యంలో వరమహాలక్ష్మి వ్రతం, ముహర్రం, కృష్ణ జన్మాష్టమి, గణేష్ చతుర్థి, దుర్గా పూజ తదితర పండుగ రోజుల్లో స్థానికంగా ఆంక్షలను అమలు చేయడంపై నిర్ణయం తీసుకోవాలని జిల్లా అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో మూడు నెలల పాటు భారీ ఊరేగింపులు నిర్వహించకూడదంటూ ఆదేశాలను జారీ చేసింది. నిబంధనలు ఉల్లహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది ప్రభుత్వం.

ఇది కూడా చదవండి: హెచ్‌సీఏలో మళ్లీ విభేదాలు.. అజారుద్ధీన్ దేశద్రోహి అన్న హెచ్‌సీఏ సెక్రటరీ

Advertisement

తాజా వార్తలు

Advertisement