Saturday, September 28, 2024

Karnataka- కేంద్ర‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ పై కేసు న‌మోదు …

బెంగ‌ళూరు – ఎన్నికల బాండ్ల పేరిట పలువురు పారిశ్రామిక వేత్తలను నిర్మలా సీతారామన్‌ బెదిరించి బీజేపీకి నిధులు వచ్చేలా చేశారని వ‌చ్చినా ఆరోప‌ణ‌ల‌పై ఆమె పై కేసు న‌మోదు చేశారు.. వివ‌రాల‌లోకి వెళితే క‌ర్నాట‌క‌కు చెందిన జనాధికార సంఘర్ష పరిషత్తు కు చెందిన ఆదర్శ్‌ అయ్యర్ దీనిపై గతంలో తిలక్‌ నగర ఠాణాలో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. అయితే, పోలీసులు అతడి ఫిర్యాదును స్వీకరించలేదు. దీంతో ఆయన చ‌ట్ట‌స‌భ ప్ర‌తినిధుల న్యాయ‌స్థానాన్ని ఆశ్రయించారు.

దీనిపై విచారణ జరిపిన చట్టసభ ప్రతినిధుల న్యాయస్థానం కేంద్ర మంత్రిపై కేసు నమోదు చేయాలని తిలక్‌నగర ఠాణా పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 10కి వాయిదా వేసింది. కోర్టు ఆదేశాల మేరకు తిలక్‌నగర ఠాణా పోలీసులు తాజాగా కేంద్ర మంత్రిపై కేసు నమోదు చేశారు. నిర్మలా సీతారామన్‌తోపాటు మరికొందరిపై కూడా ఎఫ్‌ఐఆర్‌ ఫైల్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement