Friday, September 6, 2024

Chandigarh ఎయిర్ పోర్టులో కంగ‌నాకు చేదు అనుభ‌వం..

ప్రముఖ బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌కు చేదు అనుభవం ఎదురైంది. గురువారం చండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌లో ఓ మహిళా సీఐఎస్‌ఎఫ్ జవాన్ ఆమెను చెంప దెబ్బ కొట్టింది. సెక్యూరిటీ చెకింగ్ సమయంలో కంగనా, మహిళా సెక్యూరిటీ ఉద్యోగి మధ్య వాగ్వాదం జరిగింది.. రైతులపై ద్వేషపూరితంగా మాట్లాడినందుకు కంగనా రనౌత్‌ను సీఐఎస్‌ఎఫ్ జవాన్ చెంపదెబ్బ కొట్టినట్లు తెలుస్తొంది. దీంతో వెంటనే మహిళా జవాన్‌ను అదుపులోకి తీసుకున్నారు.

ఆ తర్వాత కంగనా రనౌత్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఢిల్లీలో జరగనున్న బీజేపీ సమావేశానికి హాజరయ్యేందుకు చండీగఢ్ విమానాశ్రయానికి చేరుకోగా… సెక్యూరిటీ చెకింగ్ సమయంలో కుల్విందర్ కౌర్ అనే లేడీ జవాన్ తనను చెంపదెబ్బ కొట్టిన‌ట్టు కంగ‌నా త‌న‌ ఫిర్యాదులో పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement