Wednesday, September 18, 2024

Jammu – ఉగ్ర పోరులో కెప్టెన్ వీర‌మ‌ర‌ణం…

జ‌మ్మూలోని దోడాలో ఎన్ కౌంట‌ర్
ఓ ఉగ్ర‌వాది హ‌తం
కొన‌సాగుతున్న కాల్పులు ..

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – జమ్మూ కశ్మీర్‌ లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. దేశ రక్షణకై జవాన్లు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడుతున్నారు. తాజాగా బుధవారం కూడా జమ్మూలోని దోడా జిల్లాలో ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆర్మీ కెప్టెన్ అమరుడయ్యారు.

దోడా జిల్లాలోని అస్సార్‌ ప్రాంతంలో నలుగురు ఉగ్రవాదులు నక్కిఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. ఈ క్రమంలో అక్కడ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. ఈ ఎదురు కాల్పుల్లో 48వ రాష్ట్రీయ రైఫిల్స్ కెప్టెన్‌ ప్రాణాలు కోల్పోయినట్లు రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఆపరేషన్‌ కొనసాగుతున్నట్లు తెలిపారు. ఇక ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాదిని కూడా భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. అత్యాధునిక ఎం4 రైఫిల్‌ను స్వాధీనం చేసుకొన్నాయి. వీటితోపాటు మూడు బ్యాక్‌ప్యాక్‌ బ్యాగ్‌లను ఆ ప్రాంతంలో గుర్తించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement