Sunday, September 8, 2024

London : తెలంగాణ ఆవిర్భావ ద‌శాబ్ది ఉత్స‌వాలు.. పాల్గొన్న జ‌గ‌దీష్ రెడ్డి

లండన్ ఎన్ఆర్ఐ బీఆర్‌ఎస్‌ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ప్రారంభమ‌య్యాయి. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. లండన్ నగరంలోని టావిస్టాక్ స్క్వేర్ వద్ద తెలంగాణ అమరుల త్యాగాలను స్మరించుకుంటూ జగదీష్ రెడ్డి, లండన్ బీఆర్ఎస్ శాఖ సభ్యులు కొవ్వొత్తుల ర్యాలీ చేశారు.


ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి, అధికార ప్రతినిధులు రవి రేటినేని, రవి ప్రదీప్ పులుసు, లండన్ ఇంచార్జీ సురేష్ బుడగం, కోశాధికారి సతీశ్ గొట్టిముక్కుల, సెక్రటరీ సత్య చిలుముల, బోనగిరి నవీన్, ప్రశాంత్ మామిడాల వున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement