Tuesday, October 22, 2024

J and K – లోయ‌లోకి దూసుకెళ్లిన బ‌స్సు.. ఆరుగురు దుర్మ‌ర‌ణం

జమ్మూ కాశ్మీర్ లేహ్‌లోని దుర్గుక్ ప్రాంతంలో గురువారం ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు స్కూల్ బస్సు 200 మీటర్ల లోతైన లోయలో పడింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. మరో 22 మంది గాయపడినట్లు సమాచారం. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న రెస్క్యూ టీం ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

పెళ్లికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ బస్సులో ఇద్దరు పిల్లలు, 23 మంది స్కూల్ ఉద్యోగులు సహా దాదాపు 25 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు ఒక ఉద్యోగి వివాహానికి హాజరయ్యేందుకు దుర్బుక్‌కు వెళ్తుండగా దుర్బుక్ మోడ్ సమీపంలో లోతైన లోయలో పడిపోయింది.

- Advertisement -

కాగా.. గాయపడిన వారిని లేహ్ జిల్లా ఆసుపత్రికి తరలించడానికి ప్రభుత్వం మూడు హెలికాప్టర్లను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో.. ఇండియన్ ఆర్మీ, లడఖ్ పోలీస్, రెవెన్యూ డిపార్ట్‌మెంట్ అధికారులు మరియు స్థానిక నివాసితులు క్షతగాత్రులను ఆరోగ్య కేంద్రాలకు తరలించడంలో సహాయపడ్డారు. ప్రస్తుతం క్షతగాత్రులు లేహ్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement