Thursday, September 12, 2024

Israel Attack : గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడి.. 71మంది మృతి

గాజా స్ట్రిప్‌పై మరోసారి ఇజ్రాయెల్‌ భీకర దాడులు చేసింది. ఖాన్‌ యూనిస్‌పై జరిగిన ఈ ఘటనలో దాదాపు 71మంది మృతి చెందగా, 289మంది గాయపడినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. క్షతగాత్రులను సమీపంలోని నాస్సర్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని పేర్కొంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.

హమాస్‌ సైన్యాధిపతిని లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్‌ వెల్లడించింది. మానవతా జోన్‌గా ప్రకటించిన మువాసి పరిధిలో ఈ దాడి జరిగినట్లు సమాచారం. ఆ ప్రాంతంలో లక్షలాది మంది పాలస్తీనియన్లు రక్షణా శిభిరాల్లో తలదాచుకున్నారు. కొంతకాలంగా గాజా స్ట్రిప్​పై ఇజ్రాయెల్‌ పలుమార్లు దాడులకు పాల్పడింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement