Sunday, October 6, 2024

INDw vs SAw | భార‌త్ – స‌ఫారీల మ్యాచ్‌కు వర్షం అంతరాయం….

భారత్-దక్షిణాఫ్రికా మహిళల జ‌ట్ల‌ మధ్య జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌కు వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత మహిళలు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా, దక్షిణాఫ్రికా మహిళలు 20 ఓవర్లలో 6 వికెట్ల న‌ష్టానికి 177 ప‌రుగులు బాదింది. ఇక‌, దక్షిణాఫ్రికా నిర్దేశించిన భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది.

ఈ సిరీస్ లోని తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. దీంతో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌లో దక్షిణాఫ్రికా 1-0తో ఆధిక్యంలో ఉంది. ఇప్పటికే తొలి టీ20 మ్యాచ్ లో చివరి వరకు పోరాడిన భారత జట్టు.. సిరీస్ ను సమం చేసేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో 178 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement