Sunday, October 6, 2024

T20 WC | పాకిస్తాన్ పై భారత్ గెలుపు.. సెమీస్ ఆశలు సజీవం

మహిళల టీ20 ప్రపంచ కప్‌లో భారత మహిళల జట్టు భోణీ కొట్టింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ఈరోజు జరిగిన కీలక మ్యాచ్ లో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్‌ను భారత బౌలర్లు తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. శ్రేయంకా పాటిల్ (2/6), అరుంధతి రెడ్డి (3/19) అదరగొట్టారు. దీంతో పాకిస్థాన్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 105 పరుగులకే పరిమితమైంది.

ఇక స్వల్ప టార్గెట్‌తో చేజంగ్ ప్రారంభించిన భారత్ 18.5 మ్యాచ్‌ను ముగించేసింది. ఓపెనర్ షఫాలీ వర్మ (32), జెమీమా రోడ్రిగ్స్ (23), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (29) పరుగులతో రాణించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement