పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ తొలి పతకం సాధించింది. మహిళా షూటర్ మను భాకర్ కాంస్య పతకంతో సత్తా చాటింది. నేడు (ఆదివారం) జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో మను భాకర్ 221.7 స్కోర్తో మూడో స్థానంలో నిలిచి భారత్ పతకాల ఖాతాను తెరిచింది. దాంతో కాంస్య పతకాన్ని అందుకుంది. తద్వారా ఒలింపిక్ మెడల్ సాధించిన తొలి భారత మహిళా షూటర్గా మను భాకర్ చరిత్ర సృష్టించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement