Monday, September 16, 2024

Paris Olympics | బ్యాడ్మింటన్ డబుల్స్‌లో ముగిసిన భారత్ పోరు…

పారిస్ ఒలింపిక్స్‌లో భారత స్టార్ బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీకి ఎదురుదెబ్బ తగిలింది. నేడు జరిగిన క్వార్టర్స్‌లో మలేషియాకు చెందిన ఆరోన్ చియా – వూయ్ యిక్ సోహ్‌తో తలపడిన భారత జోడీ సాత్విక్, చిరాగ్‌లు ఓడిపోయారు. తొలి సెట్‌లో విజయంతో ఆరంభించినా.. ఆ తరువాత వరుసగా రెండు సెట్లు కోల్పోయారు. దీంతో 21-13, 14-21, 16-21 పాయింట్ల తేడాతో భారత పరుషుల డబుల్స్ జోడీ ఓటమి పాలైంది.

ఒలింపిక్ పోటీల్లో భాగంగా మరికొద్ది సేపట్లో జరిగే పురుషుల సింగిల్స్ రౌండ్ 16లో లక్ష్య సేన్ – హెచ్ ఎస్ ప్రణయ్ తలపడనున్నారు. ఈ మ్యాచ్‌లో గెలిచిన వారు క్వార్టర్స్‌కు చేరుతారు. ఇక మహిళల సింగిల్స్ 16 రౌండ్‌లో పీవీ సింధు చైనాకు చెందిన హీ బింగ్జియావోతో తలపడనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement