Thursday, September 19, 2024

Paris Olympics | ఆర్చరీలోనూ భారత్ కు…

పారిస్ ఒలింపిక్స్‌లో ఆర్చరీ విభాగంలో భారత్‌ కథ ముగిసింది. చివరి వరకు ఆశలు రేపిన దీపికా కుమారి ఈరోజు జరిగిన క్వార్టర్ ఫైనల్ తో ఇంటి ముఖం పట్టింది. దీంతో ఈ విభాగంలో పతకాలపై ఆశలు పెట్టుకున్న భారత్ కు నిరాశే ఎదురైంది. కాగా, ఈరోజు జరిగిన మహిళల వ్యక్తిగత ఆర్చరీ ఈవెంట్‌లో…. దక్షిణ కొరియాకు చెందిన నామ్ సు-హ్యోన్ తో తలపడిన దీపికా కుమారి… 4–6తో ఓడిపోయింది.

ఇక మ‌రో మ్యాచ్ లో బ‌జ‌న్ కౌర్ కూడా ఇంటి దారి ప‌ట్టింది. ఇండోనేషియా క్రీడాకారిని డియానందా చోయిరునిసా చేతిలో 5-6 తేడాతో ఓడిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement