Friday, October 4, 2024

S.Jaishankar | పాకిస్థాన్ వెళ్ల‌నున్న జైశంకర్..

భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పాకిస్థాన్ వెళ్లనున్నారు. ఈ సంద‌ర్భంగా ఇస్లామాబాద్‌లో జరగనున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. SCO కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ సమావేశాలు ఈ నెల 15, 16 తేదీల్లో జరగనున్నాయి.

కాగా, గత జూలైలో SCO శిఖరాగ్ర సమావేశానికి భారతదేశం ఆతిథ్యం ఇచ్చింది. ఈసారి ఈ స‌ద‌స్సును నిర్వ‌హించే అవకాశం పాకిస్థాన్‌కు దక్కింది. శిఖరాగ్ర సమావేశానికి ముందు మంత్రి వర్గ సమావేశం, ఎస్‌సీఓ సభ్య దేశాల మధ్య ఆర్థిక, సామాజిక సంస్కృతి, మానవతా సహాయంపై దృష్టి సారించేందుకు సీనియర్ అధికారుల సమావేశాలు జరుగనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement