Friday, September 20, 2024

India Vs Bangaldesh – అర్ధ శ‌త‌కం బాదిన య‌శ‌స్వీ…

చెన్నై టెస్ట్ లో య‌శ‌స్వి జైస్వాల్ హాఫ్ సెంచ‌రీతో ఆక‌ట్టుకున్నాడు. ఒక‌వైపు టాప్ ఆర్డ‌ర్ బ్యాట‌ర్లు నిష్క్ర‌మిస్తున్నా.. అత‌ను మాత్రం క్రీజ్‌లో నిల‌దొక్కుకున్నాడు. చెన్నైలో బంగ్లాదేశ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో.. జైస్వాల్ హాఫ్ సెంచ‌రీ న‌మోదు చేశాడు. 98 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో జైస్వాల్ అర్థ సెంచ‌రీ పూర్తి చేశాడు.

భోజ‌న విరామ స‌మ‌యం త‌ర్వాత జైస్వాల్ త‌న ఖాతాలో హాఫ్ సెంచ‌రీ వేసుకున్నాడు. టెస్టుల్లో అతినికి ఇది 5వ హాఫ్ సెంచ‌రీ. లంచ్‌కు ముందు 3 వికెట్లు కోల్పోయి 88 ర‌న్స్ చేసిన భార‌త్ ఆ త‌ర్వాత కీల‌క‌మైన పంత్ వికెట్‌ను కోల్పోయింది. పంత్ 39 ర‌న్స్ స్కోర్ చేసి ఔట‌య్యాడు. బంగ్లా బౌల‌ర్ హ‌స‌న్ మ‌హ‌మూద్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. ప్ర‌స్తుతం ఇండియా 6 వికెట్ల న‌ష్టానికి 175 ర‌న్స్ చేసింది. జైస్వాల్ 56, రాహుల్ 16 పరుగులు చేసి అవుటయ్యారు. అశ్విన్ 16పరుగులు, జడేజా 7 పరుగుతోనూ క్రీజ్‌లో ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement