Wednesday, October 9, 2024

IND vs BAN T20I | దంచి కొట్టిన ఇండియా.. బంగ్లా ముందు భారీ టార్గెట్

ఢిల్లిలోని అరుణ్‌ జైట్లి స్టేడియం వేదికగా భారత్ – బంగ్లాదేశ్‌ మధ్య రెండో టీ20లో భార‌త బ్యాట‌ర్లు దంచి కొట్టారు. సీరీసే ల‌క్ష్యంగా బ‌రిలోకి దిగిన టీమిండియా చెల‌రేగిపోయింది. సిక్సులు, ఫోర్ల‌తో బౌండ‌రీల మోత మోగించింది. దీంతో తొలుత బ్యాటింగ్ చేప‌ట్టిన భార‌త్… నిర్ణీత ఓవ‌ర్ల‌లో 221/9 ప‌రుగులు సాధించింది.

అదిలోనే టీమిండియా కీల‌క వికెట్లు కోల్పోయింది. ఈ క్ర‌మంలో క్రీజులోకి వ‌చ్చిన నితిశ్ కుమార్ రెడ్డి (34 బంతుత్లో 4ఫోర్లు, 7సిక్సులు *74), రింకూ సింగ్ (26 బంతుత్లో 5ఫోర్లు, 3సిక్సులు *53) తో బంగ్లా బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ్డారు. ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా (19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు *32), రియాన్ పరాగా (6 బంతుల్లో 2 సిక్సర్లు *15) అద్భుత ప్రదర్శన చేశారు.

బంగ్లా బౌల‌ర్ల‌లో రిషద్ హొస్సేన్ మూడు వికెట్లు తీయ‌గా.. తస్కిన్ అహ్మద్, తాంజిమ్ హసన్ సాకిబ్, ముస్తాఫిజుర్ రెహమాన్ రెండేసి వికెట్లు ప‌డ‌గొట్టారు. ప్రస్తుతం 222 పరుగుల భారీ లక్ష్యంతో బంగ్లాదేశ్ జట్టు బరిలోకి దిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement