Sunday, September 22, 2024

Paris Olympics | చేజారిన కాంస్య…

పారిస్ ఒలింపిక్స్‌లో . ఈరోజు జరిగిన బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో భారత స్టార్ ప్లేయర్ లక్ష్య సేన్ పరాజయం పాలయ్యాడు. దీంతో ఒలంపిక్స్ లో భారత్ కు తొలి పతకం సాధించాలన్న లక్ష్యసేన్ కల చెదిరిపోయింది.

కాంస్య పతకం కోసం మలేషియాకు చెందిన లీ జీ జియాతో త‌ల‌ప‌డిన లక్ష్య సేన్ అనూహ్య రీతిలో ఓడిపోయాడు. ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌ను 21-13తో కైవసం చేసుకుని మెడ‌ల్ ఆశలు రేకెత్తించిన లక్ష్యసేన్.. తర్వాతి వరుస సెట్‌లను 21-16, 21-11 పాయింట్ల తేడాతో కోల్పోయాడు.

షూటింగ్ లోనూ నిరాశే !!

మరోవైపు, షూటింగ్ స్కీట్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భారత షూటర్లు మహేశ్వరి-అనంత్ నిరాశపరిచారు. కాంస్య పతక పోరుకు అర్హత సాధించిన వారు చైనా జోడీ జియాంగ్, జియాన్లిన్‌తో తలపడ్డారు. అయితే ఈ పోటాపోటీ మ్యాచ్‌లో మహేశ్వరి-అనంత్ ద్వయం 44-43తో పతకాన్ని కోల్పోయింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement