Friday, October 4, 2024

T20 WC | తొలి మ్యాచ్‌లో త‌డ‌‘బ్యాటు’.. కుప్పకూలిన భారత్

మహిళల టీ20 ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లోనే మ‌హిళ‌ల‌ భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. గ్రూప్-ఎలో ఉన్న భార‌త్ – న్యూజిలాండ్ త‌ల‌ప‌డ‌గా…. కివీస్ జ‌ట్టు టీమిండియాకు షాకిచ్చింది. ఈ మ్యాచ్ లో తొలుత‌ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ భారత్ ముందు 161 భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

అయితే, భారీ లక్ష్యంతో ఛేజింగ్ ప్రారంభించిన హర్మన్ ప్రీత్ సేన కుప్పకూలింది. న్యూజిలాండ్‌పై 19 ఓవర్లలో 102/10 పరుగులకే పరిమితమైన భారత్ 58 పరుగుల తేడాతో ఓడిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement