Friday, September 20, 2024

India – Bangladesh – అశ్విన్ శ‌త‌కం … జ‌డేజా సూప‌ర్ నాక్….

చెన్నై టెస్ట్ లో స్విన్న‌ర్ ద్వ‌యం అశ్విన్,జడేజాలు బ్యాటింగ్ లో దుమ్ముదులిపేశారు… 144 ప‌రుగుల‌కు ఆరు వికెట్లు కోల్పొయి పీక‌లోతు క‌ష్టాల‌లో ఉన్న టీమ్ ఇండియాను త‌మ బ్యాటింగ్ తో ప‌టిష్ట‌స్థితిలో నిలిపారు.. అశ్విన్ 112 బంతుల‌లో 102 ప‌రుగులు చేయ‌గా, జ‌డేజా 117 బంతుల‌లో 86 ప‌రుగుల‌తో క్రీజ్ లో కొన‌సాగుతున్నారు.. తొలి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి ఆరు వికెట్ల న‌ష్టానికి 339 ప‌రుగులు చేసింది.. ఈ ఇద్ద‌రు ఇప్ప‌టి వ‌ర‌కు 195 ప‌రుగులు జోడించారు..

టెస్టుల్లో ఆల్‌రౌండర్ రూపంలోకి మారిపోయే అశ్విన్ కేవలం 108 బంతులు శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అతడికిది 6వ టెస్ట్ సెంచరీ కావడం విశేషం. కాగా చెన్నైలో అశ్విన్‌కు ఇది రెండవ టెస్టు సెంచరీ. టెస్టుల్లో భారత్ తరుపున 6 సెంచరీలు సాధించిన ఎంఎస్ ధోనీ, మన్సూర్ అలీ ఖాన్ పటౌడీల సరసన చేరాడు. తద్వారా తన బ్యాటింగ్ నైపుణ్యాన్ని అశ్విన్ మరోసారి నిరూపించుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement