Thursday, September 19, 2024

Paralympics | భారత అథ్లెట్లకు భారీ న‌జ‌రానా !

పారాలింపిక్స్ లో చరిత్ర సృష్టించిన భారత పారా యోధులకు కేంద్రం భారీ నజరానా ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవ్య ప్రకటించారు. పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత అథ్లెట్లకు భారీ ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు తెలిపారు.

పారాలింపిక్స్‌లో భారత్ తరఫున స్వర్ణ పతకాలు సాధించిన ఏడుగురిలో ఒక్కొక్కరికి రూ.75 లక్షలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా పారాలింపిక్స్‌లో వెండి పతక విజేతలకు రూ.50 లక్షలు, కాంస్యంతో మెరిసిన వారికి రూ.30 లక్షలు అందజేస్తామని తెలిపారు. ఇక మిక్స్‌డ్ టీమ్ విభాంలో ప‌త‌కంతో స‌త్తా చాటినవాళ్ల‌కు రూ.22.5 ల‌క్ష‌ల న‌గ‌దు ఇవ్వ‌నున్న‌ట్టు మాండ‌వీయ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement