అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో… టీమిండియా – న్యూజిలాండ్ మధ్య నేడు ప్రారంభమైన వన్డేల సిరీస్లో స్మృతి మంధాన నేతృత్వంలోని భారత జట్టు బోణీ కొట్టింది. కివీస్ పై ఆల్ రౌండ్ ప్రదర్శనతో చెలరేగిన భారత… 56 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో మూడె మ్యాచ్ ల వన్డే సిరీస్లో టీమిండియా 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా… 227 పరుగుల స్కోర్ సాధించింది. ఓపెనర్ షఫాలీ వర్మ(33), యాస్తికా భాటియా (37), జెమిమా రోడ్రిగ్స్ (35), తేజల్ హసబ్నిస్ (42), దీప్తి శర్మ(41) పరుగులతో ఆకట్టుకున్నారు. దీంతో టీమిండియా 44.3 ఓవర్లో 227 పరుగులకే ఆలౌటయ్యింది.
అనంతరం 228 పరుగుల విజయలక్ష్యంతో ఛేజింగ్ ప్రారంభించిన కివీస్ 168 పరుగులకే ఆలౌటైంది. బ్రూక్ హల్లిడే(39), మ్యాడీ గ్రీన్(31) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత్ ఓవర్లలో రాధా యాదవ్ (3/35), సైమా ఠాకూర్ (2/26) న్యూజిలాండ్ బ్యాటర్లను చిత్తు చేశారు. అరుంధతి రెడ్డి, దీప్తి శర్మ తలో వికెట్ తీశారు.