Saturday, October 5, 2024

IND vs ZIM | రాణించిన గిల్… జింబాబ్వే టార్గెట్ 183

ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా నేడు టీమిండియా-జింబాబ్వే జట్ల మధ్య జరుగుతున్న‌ మూడో టీ20లో భారత బ్యాట‌ర్లు రాణించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా జింబాబ్వే ముందు 183 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

కెప్టెన్ శుభమన్ గిల్ (66) హాఫ్ సెంచరీతో అద‌ర‌గొట్టాడు. మిడిల్ ఆర్డర్ లో రుతురాజ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడి (49) పరుగులు చేసి తృటిలో అర్ధ సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఇక ఇవ్వాల‌ తుది జట్టులోకి వచ్చిన యశస్వి జైస్వాల్ (36) పరుగులతో రాణించాడు. దీంతో భార‌త జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 182 ప‌రుగులు సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement