Tuesday, September 17, 2024

IND vs SL | శ్రీలంకతో మ్యాచ్.. టీ20 సిరీస్ ఇండియదే

శ్రీలంక ప‌ర్య‌ట‌న‌లో ఉన్న టీమిండియా టీ20 సిరీస్ ను కైవ‌సం చేసుకుంది. ఈరోజు పల్లెకెలె స్టేడియం వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో డీఎస్ పద్ధతిలో భారత జట్టు విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరస్‌ సొంతం చేసుకుంది.

162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు వరుణుడు అడ్డుపడ్డాడు. భారత జట్టు ఇన్నింగ్స్‌లో తొలి ఓవర్‌లోనే వర్షం మొదలైంది. దీంతో ఇన్నింగ్స్‌ను కుదించాలని అంపైర్లు నిర్ణయించారు. దాంతో భారత జట్టు 8 ఓవర్లలో 78 పరుగుల లక్ష్యాన్ని సాధించాల్సి ఉండగా, యశస్వి జైస్వాల్ (30), సూర్యకుమార్ యాదవ్ (26), హార్దిక్ పాండ్యా (22) మెరుపు బ్యాటింగ్‌తో 6.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుని మ్యాచ్‌ను ముగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement