Saturday, September 21, 2024

IND vs SL | వ‌న్డే సిరీస్ శ్రీలంక కైవ‌సం…

శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో భారత జట్టు ఓడిపోయింది. తొలి మ్యాచ్‌ను డ్రాగా ముగించిన టీమిండియా.. తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో శ్రీలంక స్పిన్ ఉచ్చులో పడి సిరీస్ కోల్పోయింది. ఈరోజు (బుధవారం) జరిగిన మాడో వన్డేలో 249 ప‌ర‌గుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన‌ టీమిండియా ఆలౌట్ అయ్యి…. 110 పరుగుల తేడాతో ఓడిపోయింది. దాంతో శ్రీలంక జట్లు 2-0తో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది.

దునిత్ వెల్లలేగే (5/27) విజృంభించగా… జెఫ్రీ వాండర్సే (2/34), మహేష్ తీక్షన్ (2/45), అసిత ఫెర్నాండో (1/29) చెలరేగారు. దీంతో రోహిత్ సేనకు ఓటమి తప్పలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement