Monday, September 16, 2024

IND vs SL | భార‌త్ ఇన్నింగ్స్‌కు వ‌ర్షం అంత‌రాయం..

శ్రీలంక‌లోని పల్లెకెలె స్టెడియం వేదిక‌గా జ‌రుగుతున్న మ్యాచ్ కు వర్షం అంత‌రాయం క‌లిగించింది. శ్రీ‌లంక నిర్దేశించిన 162 ప‌రుగుల టార్గెట్ తో భార‌త జ‌ట్టు చేజింగ్ కు దిగింది. అయితే, టీమిండియా ఇన్నింగ్స్ తొలి ఓవ‌ర్‌లోనే వాన మొద‌లైంది. దాంతో, అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. అప్ప‌టికీ స్కోర్ 6/0.

ఓపెనర్ య‌శ‌స్వీ జైస్వాల్(6), సంజూ శాంస‌న్‌(0)లు క్రీజులో ఉన్నారు. వాన కాసేప‌టికే త‌గ్గినా తడి ఔట్‌ఫీల్డ్ కార‌ణంగా మ్యాచ్ ఆల‌స్యం కానుంది. భార‌త జ‌ట్టు విజ‌యానికి ఇంకా 19.3 ఓవ‌ర్ల‌లో 156 ప‌రుగులు కావాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement