Sunday, September 15, 2024

IND vs SL | అద‌ర‌గొట్టిన భార‌త బౌల‌ర్లు… టీమిండియా టార్గెట్ ఎంతంటే

శ్రీలంకతో జ‌రుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన శ్రీలంక జట్టు స్వల్ప పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.

కాగా, ఈ మ్యాచ్లో శ్రీలంక బ్యాటర్ కుసల్ పెరీరా (53) హాప్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇక టాపార్డర్‌‌లో పాతుమ్ నిస్సాంక (32) కమిందు మెండిస్ (26) రాణించడంతో టీమిండియా ముందు డిఫెండిగ్ టార్గెట్ సెట్ చేయగలిగింది. ఇక‌, భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ (26/3), అర్ష్దీప్ సింగ్ (24/2), అక్షర్ పటేల్ (30/2), హార్దిక్ పాండ్యా (23/2) వికెట్లు తీశారు. కాగా, 162 పరుగుల టార్గెట్‌తో టీమిండియా చేజింగ్ ప్రారంభించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement