Thursday, September 19, 2024

IND vs PAK | భార‌త్ శుభారంభం… పాక్‌పై ఘన విజ‌యం..

మహిళల ఆసియా కప్ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ విజయంతో శుభారంభం చేసింది. ఇవాళ జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై అద్భుత విజయం సాధించింది. దంబుల్లా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఆల్ రౌండ్ షోతో పాక్‌ను చిత్తుగా ఓడించి బోణీ కొట్టింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాక్ జట్టును… టీమిండియా 108 పరుగులకే పరిమితం చేసింది. అనంత‌రం స్వ‌ల్ప చేధ‌న‌లో ఓపెనర్లు స్మృతి మంధాన (45), షఫాలీ వర్మ (40) అద్భుత ఇన్నింగ్స్ ఆడి బౌండరీలతో రెచ్చిపోయారు. దీంతో భారత్ 14 ఓవర్లలోనే మ్యాచ్ ముగించి 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement