Friday, September 20, 2024

AP | సచివాలయ ఉద్యోగులకు కీలక ఆదేశాలు

గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు, హోదాతో సంబంధం లేకుండా రోజుకు మూడుసార్లు బయోమెట్రిక్ ద్వారా హాజరుకావాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఉద్యోగులు బయోమెట్రిక్ ద్వారా మూడుసార్లు హాజరు చేస్తున్నారో లేదో స్థానిక ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. మొదటిసారిగా ఉదయం 10:30 గంటలకు, రెండోసారి మధ్యాహ్నం 3 గంటలకు, మూడోసారి సాయంత్రం 5 గంటలకు బయోమెట్రిక్ హాజరు వేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement