Sunday, September 8, 2024

TG | రాజకీయంగా ఏమీ ఆశించను : పోచారం శ్రీనివాస్​రెడ్డి

కాంగ్రెస్​ పార్టీలో చేరడం వెనుక రాజకీయంగా ఏమి కూడా ఆశించడం లేదని బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం తన ఇంటికి వచ్చిన సీఎం రేవంత్​, మంత్రి పొంగులేటి శ్రీనివాస్​లు కాంగ్రెస్​ లోకి ఆహ్వానించగా ఆయన పార్టీలో చేరారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తన రాజకీయ ప్రస్థానం మొదలైంది కాంగ్రెస్​తోనేనని చెప్పారు. తర్వాత టీడీపీ, బీఆర్​ఎస్​లలో పని చేశానని చెప్పారు. మళ్లీ ఇన్నాళ్లకు ఇదే పార్టీలో చేరానన్నారు. రాష్ట్రంలో ఆరునెలలుగా కాంగ్రెస్​ పార్టీ అద్భుతంగా పాలన చేస్తుందన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. సర్కారు అమలు చేస్తున్న విధానాలు బాగున్నాయని కితాబునిచ్చారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement