Friday, September 20, 2024

Hyderabad – క‌దులుతున్న‌ బ‌స్సులోనే …..

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – హైద‌రాబాద్ – హైద‌రాబాద్ లో క‌దులుతున్న బ‌స్సులోనే అత్యాచారానికి గురైన సంఘ‌ట‌న వెలుగు చూసింది.. వివ‌రాల‌లోకి వెళితే నిర్మల్ నుండి ప్రకాశం జిల్లాకు 36 మంది ప్రయాణికులతో ఓ ట్రావెల్స్ బస్సు వెళ్తుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ కు నేటి తెల్ల‌వారుఝామున‌ వచ్చింది. తెల్లవారుజామున అంతా గాడ నిద్రలో ఉన్న సమయంలో డ్రైవర్ యువతి వద్దకు వెళ్లి నోట్లో గుడ్డలు పెట్టి లైంగిక‌దాడికి పాల్ప‌డ్డాడు.

దీంతో యువతి 100కు ఫోన్ చేసింది. బస్సును వెంబడించిన హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. యువతి దగ్గర స్టేట్మెంట్ తీసుకుని కంప్లైయింట్ ఫైల్ చేశారు. యువతిని వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితుడైన‌ డ్రైవర్ పరారీలో ఉండగా మరో డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బస్సును సీజ్ చేసినట్టు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement