Wednesday, September 18, 2024

Siddaramaiah | కర్ణాటక ముఖ్యమంత్రికి హైకోర్టులో ఊరట

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకి హైకోర్టు ఊరటనిచ్చింది. భూ కుంభకోణం కేసులో తదుపరి ఆదేశాలిచ్చేంత వరకూ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోడానికి వీల్లేదని ట్రయల్ కోర్టుకి ఆదేశాలిచ్చింది. ఆగస్టు 29వ తేదీ వరకూ ఎలాంటి చర్యలు తీసుకోకూడదని స్పష్టం చేసింది. ఆ రోజు మరోసారి హైకోర్టు ఈ కేసుపై విచారణ చేపట్టనుంది.

గవర్నర్ నోటీసులు ఇవ్వడాన్ని చట్ట వ్యతిరేకమని వాదించిన సిద్దరామయ్య ఈ మేరకు కోర్టుని ఆశ్రయించి పిటిషన్ వేశారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వాన్నీ కూల్చే ప్రయత్నం జరుగుతోందని ప్రస్తావించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. సిద్దరామయ్యకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement