Sunday, September 15, 2024

ఖ‌ద్ద‌ర్ వ్యాపారంలోకి క‌మ‌ల్ హాస‌న్.. క‌లిసి వ‌చ్చేనా..!

స్టార్ హీరో క‌మ‌ల్ హాస‌న్ ఇండియన్ 2 సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు శంక‌ర్ తెర‌కెక్కిస్తున్నారు.. కాగా కమలహాసన్ ఖద్దర్ వ్యాపారంగంలోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. ఆయన ఎప్పటినుంచో ఖద్దర్ వస్త్రాలకు చేనేత కార్మికులకు మద్దతుగా నిలబడుతూ వచ్చారు.. ఇకపోతే హౌస్ ఆఫ్ ఖద్దర్ అనే వ్యాపార సంస్థను కూడా ప్రారంభించారు.. ఇప్పుడు ఈ వ్యాపారాన్ని మరింత విస్తృతం చేయడానికి ఖద్దర్ వస్త్రాల నిపుణులతో కలిసి ఇటలీకి వెళ్ళినట్లు పార్టీ నాయకులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం అదే వ్యాపారంగంలోకి దిగి ఈ వ్యాపారాన్ని మరింత విస్తరింప చేసే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.

మరి ఇండస్ట్రీలో నటుడిగా సక్సెస్ అయిన కమలహాసన్ వ్యాపారంలో కూడా సక్సెస్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.ప్రస్తుత కాలంలో యంగ్ హీరోలు ఒకవైపు సినిమాలు చేస్తూనే ఆ సినిమాల ద్వారా వచ్చిన డబ్బుతో వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే మహేష్ బాబు , ప్రభాస్ లను మొదలుకొని నేటి యంగ్ హీరోలు నితిన్, నాగచైతన్య వరకు ఇలా చాలామంది సినిమాల ద్వారా వచ్చిన డబ్బుతో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి సక్సెస్ అవుతున్నారు. అయితే ఇప్పుడు చాలా కాలం తర్వాత యంగ్ హీరోల బాటలో విశ్వనటుడు కమలహాసన్ నడిచే ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డబ్బు సంపాదించాలంటే ఒక్క సినిమాలు మాత్రమే సరిపోదు.. సినిమాల ద్వారా వచ్చిన డబ్బులు రియల్ ఎస్టేట్ లేదా ఇతర వ్యాపార రంగాలలో పెట్టుబడి పెట్టనప్పుడే.. డబుల్ ప్రాఫిట్ వస్తుంది. అందుకే క‌మ‌ల్ హాస‌న్ కూడా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement