Thursday, September 19, 2024

Hockey – అసియా హాకీ టోర్నీ – పాక్ పై భార‌త్ విజ‌యం…..

ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో ఇండియా సత్తా చాటుతోంది. చైనాలో జరుగుతున్న ఈ టోర్నీలో భారత్ ఇప్పటికే నాలుగు మ్యాచ్ లను గెలిచింది. గ్రూప్ దశలో చివరి మ్యాచ్ ఈరోజు జరిగింది. ఈ మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను భారత్ 2-1తో ఓడించింది. ఇండియా తరపున కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ రెండు గోల్స్ చేశాడు. పాక్ తరపున అహ్మద్ నదీమ్ ఒక గోల్ సాధించాడు. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నమెంట్ లో ఇండియా ఇప్పటికే సెమీస్ కు చేరింది. టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా భారత్ సెమీస్ లో అడుగుపెట్టింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement