Wednesday, October 23, 2024

Hockey – భార‌త్ కు షాక్ ఇచ్చిన జ‌ర్మ‌నీ..

న్యూ ఢిల్లీ – రెండు టెస్టుల ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా ప్రపంచ ఛాంపియన్‌ అయిన జర్మనీతో నేడు ఢిల్లీ వేదిక‌గా జరిగిన తొలి టెస్టులో భారత్‌ 0-2 తేడాతో ఓటమిపాలైంది. జ‌ర్మనీ తరఫున హెన్రిక్ మెర్ట్జెన్స్ (4వ నిమిషం), లుకాస్ విండ్‌ఫెడర్ (30వ నిమిషం) గోల్స్‌ సాధించారు. భారత్ ఈ మ్యాచ్‌లో ఎనిమిది పెనాల్టీ కార్నర్‌లు, ఒక పెనాల్టీ స్ట్రోక్ లు వ‌చ్చినా వాటిని స‌ద్వినియోగం చేసుకోలేక‌పోయింది సిరీస్‌లో రెండో టెస్టు గురువారం ఢిల్లీలోనే జరగనుంది. ఇక పారిస్‌ ఒలింపిక్స్‌ సెమీస్‌లో భారత్‌ 2-3తో జర్మనీ చేతిలోనే ఓడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement