Monday, September 16, 2024

TG – CM | భారీగా వ‌ర‌ద న‌ష్టం.. నిధులు కేటాయించండి

తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు పర్యటించారు. అనంతరం హైదరాబాద్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలువురు మంత్రులతో సమావేశమయ్యారు. వరద ప్రభావం, నష్టాన్ని సచివాలయంలో కేంద్రమంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రి, అధికారులు వివరించారు. తక్షణ సాయంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున బాధిత కుటుంబాలకు రూ.10వేలు పంపిణీ చేస్తున్నట్లు కేంద్ర మంత్రికి సీఎం చెప్పారు.

ఈ క్రమంలోనే కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన చేశారు. రాష్ట్రంలో వరద నష్టం తీవ్రంగా ఉన్నందున కేంద్ర ప్రభుత్వం తక్షణ సహాయంతో పాటు శాశ్వత పునరుద్ధరణ పనులకు తగిన నిధులు కేటాయించాలని శివరాజ్ సింగ్ చౌహాన్‌ను రేవంత్ రెడ్డి కోరారు. ఏపీకి ఎలాంటి సాయం అందిస్తారో అదే స్థాయిలో తెలంగాణకు అందించాలని, రెండు రాష్ట్రాలను సమానంగా చూడాలని సీఎం కోరారు.

రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఒక్క రోజే 40 సెం.మీ వర్షం కురిసిందని, వరదల వల్ల సుమారు 5,438 కోట్ల నష్టం జరిగినట్టు ప్రాథమికంగా అంచాన వేసినట్టు వివరించారు. వరద ప్రభావిత గ్రామాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉందని.. రోడ్లు, ఇల్లు, బ్రిడ్జీలు దెబ్బ తిన్నాయ‌ని.. తీవ్ర పంట నష్టం జరిగిందని కేంద్ర మంత్రికి వివరించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎస్ శాంతికుమారి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement