Wednesday, September 18, 2024

Delhi | కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బెయిల్ కోరుతూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను రోస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో కవిత పాత్రపై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటును పరిగణనలోకి తీసుకునే అంశం, సీబీఐ కేసులో బెయిల్ ఇచ్చే పిటిషన్‌పై విచారణను వాయిదా వేసింది. తదుపరి విచారణను రూస్ అవెన్యూ కోర్టు జూలై 22కి వాయిదా వేసింది.

ఈ మేరకు ట్రయల్ కోర్టు జడ్జి కావేరి భవేజా తెలిపారు. సీబీఐ ఛార్జిషీట్‌లో తప్పులు ఉన్నాయని కవిత తరఫున సీనియర్ న్యాయవాది నితీశ్ రాణా వాదనలు వినిపించారు. ఛార్జిషీట్‌లో ఎలాంటి తప్పులు లేవని సీబీఐ తరఫు న్యాయవాది పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement