Tuesday, September 17, 2024

Haryana – ఫ్యాక్ట‌రీలో అగ్నిప్ర‌మాదం…ముగ్గురు స‌జీవ ద‌హ‌నం

హర్యానాలోని దౌల్తాబాద్ పారిశ్రామికవాడలోని ఓ ప్రైవేట్ కంపెనీలో గ‌త రాత్రి జ‌రిగిన అగ్నిప్రమాదం ముగ్గురు స‌జీవ ద‌హ‌న‌మ‌య్యారు. మ‌రికొంద‌రికి గాయాల‌య్యాయి.. వివ‌రాల‌లోకి వెళితే గురుగ్రామ్-ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే సమీపంలోని ఫ్యాక్టరీలో అర్థరాత్రి పేలుడు సంభవించింది. దీంతో ఫ్యాక్టరీలో భారీగా మంటలు చెలరేగాయి. ఇక్కడ పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. ఈ ఘటన హర్యానాలోని గురుగ్రామ్‌లోని దౌల్తాబాద్ పారిశ్రామిక ప్రాంతంలో చోటుచేసుకుంది. బాయిలర్ పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. ఫ్యాక్టరీ చుట్టూ ఉన్న భవనాలు, ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. అగ్నిమాప‌క సిబ్బంది మంటలను ఆర్పివేశారు.. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement