Monday, September 30, 2024

TG | రాహుల్ గాంధీకి హరీశ్ రావు బహిరంగ లేఖ..

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాజీమంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో అంబేద్కర్ రాజ్యాంగం నడవడం లేదని.. అధికార దుర్వినియోగంతో దుర్మార్గ, దుష్టపాలన సాగుతోందని ఆరోపించారు. మానవత్వాన్ని, న్యాయాన్ని ప్రభుత్వం బుల్‌డోజర్‌తో అణిచివేస్తోందని విమర్శించారు.

మూసీ రివర్‌ఫ్రంట్‌, హైడ్రా పేరుతో పేద, మధ్య తరగతి కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారని… తెలంగాణలో పౌరహక్కులను నిరంతరం ప్రభుత్వం ధిక్కరిస్తోందని హరీశ్‌రావు లేఖలో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని న్యాయ సూత్రాలను, చట్టాలను గౌరవించేలా… ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సలహా ఇచ్చి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని హరీశ్‌రావు లేఖ ద్వారా కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement