Monday, September 16, 2024

TG | కవితను కలిసిన హరీశ్ రావు, రవిచంద్ర..

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మాజీ మంత్రి హరీశ్ రావు, వద్దిరాజు రవిచంద్ర కలిశారు. ఇటీవల కవిత అస్వస్థతకు గురయ్యారు. జైలు అధికారులు ఆమెను నిన్న ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ నేతలు హరీశ్ రావు, వద్దిరాజు రవిచంద్ర తీహార్ జైలుకు వెళ్లి కవితను కలిశారు.

మరోవైపు ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసులో అరెస్టయిన కవిత బెయిల్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆమె రూస్ అవెన్యూ కోర్టుతో సహా సుప్రీంకోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంది. రూస్ అవెన్యూ కోర్టు ఆమె బెయిల్ పిటిషన్‌లను ప‌లుమార్లు తిరస్కరించింది… కాగా, ప్రస్తుతం ఆమె బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. తదుపరి విచారణ ఈ నెల 27న జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement