Friday, October 18, 2024

TG | మార్గ‌ద‌ర్శ‌కాలు కాదు… మ‌భ్యపెట్టే ప్ర‌య‌త్నాలు : హరీశ్ రావు

రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. రుణమాఫీ పథకం అమలు విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు చూస్తే, రైతుల వలపోతల కంటే వడపోతల పైనే ఎక్కువ దృష్టి పెట్టిందనే విష‌యం స్ప‌ష్టంగా అర్థమవుతోందన్నారు.

పంట‌ల రుణ‌మాఫీ విష‌యంలో ఎన్నికల సమయంలో ఒకమాట, అధికారంలోకి వచ్చాక ఒక మాట మాట్లాడుతున్నార‌ని… చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అనే పద్ధతి కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని మండిప‌డ్డారు. .

డిసెంబర్ 12, 2018 వరకు ముందున్న రైతులకు వర్తించదు అనే నిబంధన సరికాదన్నారు. రుణమాఫీకి ఇన్ని ఆంక్షలు సరికాదన్నారు. రుణమాఫీకి విధించిన గడువు కూడా అసమంజసంగా ఉందన్నారు. రైతుకు రుణభారం తగ్గించే ప్రయత్నం కన్నా ప్రభుత్వ భారం తగ్గించుకునే ప్రయత్నమే ఎక్కువ కనపడుతుందని అన్నారు.

ఆహార భద్రత కార్డు, పీఎం కిసాన్ పథకం ప్రామాణికమని ప్రకటించడం అంటే లక్షలాది రైతుల ఆశలు నీరుగారినట్లే అన్నారు. ఎన్నికలప్పుడు మభ్యపెట్టి… అధికారం చేజిక్కించుకున్నాక ఆంక్షలు పెట్టడమేమిటి అని మండిప‌డ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement