Saturday, September 21, 2024

TG | అక్కచెల్లెల్లందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు : సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని మహిళలందరికీ సీఎం రేవంత్‌ రెడ్డి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని అన్నారు. మహిళల సాధికారతతో పాటు మహిళలను కోటిశ్వరులను చేసే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తోందని అన్నారు.

ఆరు గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 గ్యాస్‌ సిలిండర్‌తో పాటు రెండు వందల యూనిట్ల ఉచిత గృహ విద్యుత్తు పథకాలను ఇప్పటికే అమలు చేసిందని గుర్తు చేశారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం తగినంత చేయూతను అందిస్తుందని తెలిపారు.

మహిళల రక్షణ, భద్రత విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని, ఎక్కడ మహిళల అభివృద్ధి, సంక్షేమం విషయంలో ఎక్కడా రాజీ పడేది లేదని అన్నారు. అక్కా చెల్లెళ్లందరికీ తమ ప్రభుత్వం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని, అందరి దీవెనలతో విజయవంతంగా ప్రజాపాలన సాగిస్తుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement