Wednesday, September 25, 2024

Gujarath – కారు – లారీ ఢీ – ఏడుగురు దుర్మరణం

అహ్మదాబాద్ : గుజరాత్‌లో నేటి తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సబర్‌కాంతా జిల్లాలోని హిమ్మత్ నగర్ వద్ద కారు – లారీ ఢీకొన్నాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు..

పలువురు తీవ్రంగా గాయపడ్డారు.ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాదానికి అతి వేగమే కారణమని పోలీసులు నిర్ధారించారు. కారు పూర్తిగా ధ్వంసంమైంది. కారు శ్యామలజీ నుంచి అహ్మదాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement