Saturday, October 19, 2024

Group 1 – పరీక్షలు వాయిదా వేసే ప్రసక్తే లేదు – తేల్చేసిన రేవంత్

హైదరాబాద్ – మెయిన్స్ పరీక్షలు ఈనెల 21 నుంచి యథాతథంగా జరుగుతాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.కాలయాపనకు పుల్ స్టాప్ పెట్టాలని ఎగ్జామ్స్ పెడుతున్నామన్నారు. హైదరాబాద్ లోని పోలీస్ డ్యూటీ మీట్ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ పరీక్షల కోసం ఎన్నో ఏళ్లుగా నిరుద్యోగులు నిరీక్షిస్తున్నారన్నారు.

ఇప్పటికే 95 శాతం మంది అభ్యర్థు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారనీ అంటూ . మరో 5 శాతం మంది డౌన్ లోడ్ చేసుకోవాలని కోరారు.

563 పోస్టులకు తెలంగాణ ఏర్పడిన తరువాత మొదటి సారి జరుగుతున్న ఎగ్సామ్స్ ఇవి.. 31వేల మంది మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేసినట్టు తెలిపారు.

ఆందోళన చేస్తున్న గ్రూపు-1 అభ్యర్థుల పై ఎలాంటి కేసులు పెట్టొద్దని పోలీసులను సీఎం ఆదేశించారు. కొందరూ అభ్యర్థులు భావోద్వేగంతో ఉన్నారు. వాళ్లపై లాఠీ ఛార్జీ చేయాల్సిన అవసరం లేదన్నారు. . వాళ్ల పై కేసులు పెడితే పోటీ పరీక్షల్లో రాణించినా ఉద్యోగులకు అనర్హులు అవుతారన్నారు.. వీళ్లు గ్రూపు-1 పరీక్షలో పాస్ అయితే తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు అవుతారనీ , . అభ్యర్థులపై మానవత్వంతో వ్యవహరించాలని పోలీసులకు సూచించారు రేవంత్ రెడ్డి..

Advertisement

తాజా వార్తలు

Advertisement