Friday, September 20, 2024

TG | రుణమాఫీ కాని వారి కోసం ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్..

తెలంగాణ ప్రభుత్వం మూడు విడతల్లో రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఆగస్టు 15న విడుదల చేసిన మూడో విడతలో రూ.2 లక్షల రుణమాఫీ చేశారు. అయితే, రుణమాఫీ కాలేదని కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వారికి శుభవార్త అందించింది.

అర్హత ఉన్నా.. రుణమాఫీ కోసం కాని రైతుల‌కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఆధార్‌లో తప్పులుంటే.. ఆధార్‌కు బదులుగా ఓటరు లేదా రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్‌ను పరిగణనలోకి తీసుకోనున్న‌ట్టు తెలిపింది. రేషన్ కార్డు లేకపోతే రైతుల కుటుంబాలకు సర్వే నిర్వహిస్తామన్నారు. బ్యాంక్ ఖాతాలో వ్యత్యాసాలను సరిచేయడానికి ఆధార్, పోర్టల్ ఏర్పాటు చేయనున్నారు. అసలు, వడ్డీ లెక్కలు సరిపోకపోతే ఇంటింటికీ వెళ్లి ఫిర్యాదులు స్వీకరించి కొత్త మార్గదర్శకాలు జారీ చేస్తామని కాంగ్రెస్ ట్వీట్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement